Posts

Showing posts from January, 2019

(Telugu) రామయ్య-రంగయ్యల కథ

[:te]ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒకసారి రామయ్యవ్యాపార నిమిత్తం దూర దేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల లోహమును తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి పోయి "మిత్రమా! నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలచాను. నేను నీ వద్ద దాచి ఉంచిన లోహం నాకు ఇమ్ము" అని అడిగాడు. "అయ్యో మిత్రమా! ఈ ఏడు ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతయు అవితిని పొట్టన పెట్టుకొన్నవి. ఈ మాట నీకు చెప్పటానికి నోరు రాలేదు. నేనెంతగానో చింతించాను" అది ఆ దేవునికే తెలుసు అంటూ ఆ రంగయ్య కంటతడి పెట్టాడు. మిత్రుడు తనను మోసం చేశాడని రామయ్య గ్రహించి "వీనితో తగువు పడుట కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుట మంచిది" అని భావించి, "నా దురదృష్టమునకు నీవేమి చేయగలవు రంగయ్య! జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది" అని పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు ...

(Telugu) కొంగలు-పాము కథ

[:te]ఒక అడవిలోని చెట్టుపై ఒక కొంగల జత గూడు కట్టుకొని నివశిస్తున్నాయి. వాని పిల్లలను గుడ్లను ఆ చెట్టు కింద పుట్టలోనున్న పామొకటి తినేయసాగింది. పాము బాధ తప్పించుకోడానికి కొంగలు ఉపాయం పన్నాయి. అవి కొన్ని చేపలను తెచ్చి పాము పుట్ట నుండి ముంగిస రంధ్రం వరకూ వేశాయి. రంధ్రం నుండి బయటకు వచ్చిన ముంగిస ఆ చేపలను తింటూ పాము పుట్ట వద్దకు వెళ్ళింది. బయటకు వచ్చిన పామును ముక్కలు ముక్కలుగా చంపింది. కొంగలు తమ శత్రువైన పాము చచ్చిందని సంతోషించాయి. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పామును చంపిన ముంగిస చెట్టుపైకెక్కి మంచి మాంసం దొరికింది అని కొంగ గుడ్లను, పిల్లలను తేనేసింది. కాబట్టి ఉపాయం ఆలోచించగానే సరి కాదు. దానితో పాటు అపాయాన్ని కూడా గుర్తించాలి. ఉపాయంలో అపాయం ఉందేమో చూసుకోవాలి" అని తండ్రి చెప్పాడు. దుష్టబుద్ధి తండ్రి వినలేదు. చివరకు చేసేది లేక ముసలి తండ్రి చెట్టు తొర్రలో దాగి సాక్ష్యం చెప్పుటకు అంగీకరించాడు. మరునాడు దుష్టబుద్ధి, సుబుద్ధి, రాజుగారు, వారివెంట కొందరు భటులు, ఊరి పెద్దలు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు. రాజు చెట్టుని చూచి "ఓ వృక్షరాజమా! ధనం ఉన్న బిందెను నీ సమక్షంలో సుబుద్ధి, దుష్టబుద్ధి దాచా...

(Telugu) సుబుద్ధి-దుష్టబుద్ధి కథ

[:te]పూర్వం ఒక గ్రామంలో సుబుద్ధి, దుష్టబుద్ధి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వారు వ్యాపారం చేసి ధనం సంపాదించుకొనిరావాలని ఇల్లు విడిచి వెళ్ళారు. దారిలో వారికి ధనంతో నిండి ఉన్న బిందె ఒకటి దొరికింది. దానిని తీసుకొని ఇద్దరూ ఆ ధనాన్ని చెరిసగం తీసుకుందామని ఇళ్ళకు బయలుదేరారు. పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రివేళ ఊరి బయట ఒక చెట్టు కింద వారాబిందెను పాతి పెట్టి ఏదో ఒకరోజు మరల అదే విధంగా ఇద్దరూ వచ్చి బిందెను తీసుకొని పోవచ్చని, అలా చేస్తే గ్రామస్తులకు తమపై అనుమానం రాదని, అసూయ కలగదని వారు నిర్ణయించుకొని ఎవరిళ్ళకు వారు వెళ్ళారు. దుష్టబుద్ధికి ఆశ పెరిగింది. ఆ బంగారు నాణేలు మొత్తం తానొక్కడే కాజేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఒక్కడే వెళ్ళి ఆ బిందెను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత సుబుద్ధి వచ్చి "మిత్రమా! మనం దాచిన ధనం గల బిందెను తెచ్చుకుందాం రా" అన్నాడు. దుష్టబుద్ధి అతని వెంట బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ చెట్టు కింద తవ్వారు. ఎంత తవ్వినా ఎంత వెదికినా బిందె కనపడలేదు. దుష్టబుద్ధి సుబుద్ధితో "దుర్మార్గుడా! నన్ను మోసం చేస్తావా! ఇక్కడ దాచిన బిందె ఏమౌతుంది? నీవు నాకు చెప్పకుండా ముందుగ...

(Telugu) కోతులు-సుచీముఖం కథ

[:te]కొంతకాలం క్రితం ఒక చెట్టు మీద "సుచీముఖం" అనే చిన్న పక్షి ఒకటి నివశిస్తూ ఉండేది. అది చాలా తెలివైనది కూడా. ఆ సమీపంలోని చెట్లమీద కొన్ని కోతులు నివశిస్తున్నాయి. చలికాలం వచ్చింది. ఒకరోజు చలి ఎక్కువగా పడసాగింది. చలికి తట్టుకోలేక కోతులు చలిమంట వేసుకోవాలనుకున్నాయి. అవి కొన్ని మిణుగురు పురుగులను చూచి నిప్పు అనుకుని వాని చుట్టూ కూర్చొని చలికాచుకోసాగాయి. సుచీముఖం ఆ కోతుల తెలివి తక్కువతనానికి లోలోన నవ్వుకొని "మిత్రులారా! అవి మిణుగురు పురుగులు కాని, నిప్పురవ్వలు కాదు. వాటివల్ల మీ చలి తీరదు. అదిగో ఆ చెట్టు వద్ద నిప్పు ఉన్నది. అచటికి వెళ్ళి చలి కాచుకోండి" అని చెప్పింది. ఆ మాటలు విన్న కోతులకు కోపం వచ్చింది. "నోరు మూసుకో, చూడబోతే చిటికెడంత లేవు, నీవు మాకు నీతులు చెప్పేదానవా? నీకున్నపాటి బుద్ధి మాకు లేదనుకున్నావా? నీకింత పొగరా!" అని ఆ కోతులు దాని మెడ పట్టుకొని పిసికి చంపేశాయి. కనుక మూర్ఖులకు హితం చెప్పరాదు. చెప్పినా బుద్ధిహీనులు వారి మాటలు వినక మనకే హాని పెడతారు. అలాంటివారికి సహాయం చేయబోయి చివరకు వారే చెడిపోతారు. పూర్వం సుబుద్ధిని చెరుపబోయి దుష్టబుద్ది చెడిపోయాడు. నీకా...

(Telugu) మూడుచేపల కథ

[:te]ఒక చెరువులో "దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి" అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక సంవత్సరం వానలు సరిగా పడక చెరువులో నీరు బాగా తగ్గింది. అది గ్రహించి దూరదర్శి మిగిలిన రెండు చేపలను చూచి "స్నేహితులారా! ఈ ఏడు వానలు లేవు. మనమున్న ఈ చెరువు ఎండిపోతుంది. కనుక మనము మరొక చెరువుకు పోదాము. లేకుంటే జాలరులు వచ్చి మనల్ని పట్టుకొని చంపేస్తారు" అన్నది. ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే ఎక్కడో తెలియని చోటుకి వెళ్దామంటావేంటి? అంతగా ఆపద వస్తే అపుడు ఆలోచిద్దాంలే, తరువాత దేవునిపైన భారం వేద్దాం అన్నది కుశాగ్రబుద్ధి. మందబుద్ధి కూడా ఏం మాట్లాడక ఊరుకుంది. వీళ్ళతో మనకు కుదరదని దూరదర్శి ఆ రోజే మరొక చెరువుకు వెళ్ళిపోయింది. మరికొన్నాళ్లకు చెరువులో నీరు బాగా తగ్గిపోగా, జాలర్లు వచ్చి వలలు పన్ని చేపలు పట్టారు. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి ఇరువురూ ఆ వలలో చిక్కుకున్నారు. ఒక జాలరి వచ్చి అవి చిక్కుకున్న వలను విడతీసి బతికి ఉన్న చేపలను తన చేతిలోనికి, చనిపోయిన చేపలను చెరువు గట్టుపైకి వేయుచున్నాడు. అది గమనించిన కుశాగ్రబుద్ధి చనిపోయిన దానివలే కదలక, మెదలక పడియున్నది. జాలరి దానిని ఒడ్డుకు విసిరి వేశాడు. స...

(Telugu) హంసలు-తాబేలు కథ

[:te]పూర్వం ఒక కొలనులో "కంబుగ్రీవం" అనే తాబేలు, వికటము, సంకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉండేవి. ఎండాకాలం సమీపించింది. హంసలు తాబేలుతో "మిత్రమా! ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది. కాబట్టి మేము వేరొక సరస్సునకు పోతలచాము" అన్నాయి. తాబేలు బాధతో "ఇదేమి అన్యాయము, ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా ఒదిలి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా? మిమ్ములను చూడకుండా ఒక్కరోజైనా బతకగలనా! ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకొని పొండి" అని బతిమాలింది. హంసలు ఒక ఉపాయం ఆలోచించి, ఒక పుల్లను తెచ్చి అవి తాబేలుతో మిత్రమా! నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండుము. మేమిద్దరం చెరొక కొనను మా ముక్కులతో పట్టుకొని పైకెగిరెదము. మా మధ్యలో నీవునూ మాతోపాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు చేరుకోగలవు. మేము చెప్పేవరకు నోరు తెరవవద్దు అని చెప్పాయి. అందుకు తాబేలు సంతోషంతో అలాగే అంది. బయలుదేరే ముందు హంసలు తాబేలుతో "మిత్రమా! మార్గంలో ఎన్నో పల్లెలు, పట్నాలు వస్తాయి. ఆకాశంలో వెళుతున్న మనల్ని చూసి జనం గోల చేస్తారు, పిల్లలు కేరింతలు కొడతారు. నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు. నీవు మాత్రం ఎట్టి పరిస్థిత...

(Telugu) సముద్రుడు-తీతువుపక్షి కథ

[:te]పూర్వం సముద్రతీరాన గల చెట్టు మీద తీతువు పిట్టల జంట నివశిస్తూ ఉండేది. సముద్రంలోని అలలు పెద్ద ఎత్తున వచ్చి చెట్టుపై ఉన్న ఆ పక్షి గుడ్లను మింగేయసాగాయి. అపుడు ఆడ తీతువు పక్షి భర్తను చూచి "నాధా! ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను పొట్టన పెట్టుకుంటున్నాడు. ఇచట నివశించటం మనకు క్షేమం కాదు. మరొక చెట్టుపైకి పోదాం" అన్నది. మగతీతువు పక్షి "పిచ్చిదానా! మన రాజు గరుత్మంతుల వారు. ఆయన విష్ణు దేవుని వాహనము. పక్షి కులాన్ని రక్షించటం ఆయన విధి. అందువలన ఆయనను వేడుకొన్నామంటే వెంటనే వచ్చి మనకు సహాయం చేస్తాడు. ఆయన బలం ముందు సముద్రుడెంత? నీవేమీ విచారించకు" అని చెప్పాడు. అపుడు ఆడతీతువు పక్షి హితుల మాటలు విని మూర్ఖులవుతారు. "కర్ర విడిచి నేల పడిన తాబేలు" వలే చనిపోతారు. నీకా కథ చెపుతాను విను ఈ కథ చెప్పటం ప్రారంభించింది.  [:]

(Telugu) వడ్రంగి-సింహం కథ

[:te]ఒక ఊరిలో వడ్రంగి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకొని, వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం కొనసాగించేవాడు. ఒకనాడు అతనికి సింహం ఎదురైంది. సింహాన్ని చూచి వడ్రంగి గజగజ వణుకుతూ నిలబడ్డాడు. అప్పుడు సింహం "నీవెందుకు భయపడుతున్నావు? నిన్ను ఏమీ చేయనులే" అన్నది. వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకొని రెండు అడుగులు ముందుకు వేసి తన వద్దనున్న అన్నం, కూరలు సింహం ముందు పెట్టాడు. ఆనాటి నుండి వడ్రంగి, సింహం మంచి స్నేహితులయ్యారు. అతడు ప్రతిరోజూ సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చి పెట్టసాగాడు. పండుగలకూ, పబ్బాలకూ పిండి వంటలు కూడా తెచ్చి పెట్టేవాడు. కొన్నాళ్ళు జరిగిన తరువాత సింహానికి ఒక కాకి, నక్కతో స్నేహం ఏర్పడింది. అది వాటికి తన స్నేహితుడైన వడ్రంగి గురించి గొప్పగా చెప్పింది. అవి అతనిని తమకు చూపించమని కోరాయి. ఒకనాడు వడ్రంగి వచ్చేవేళకు సింహం స్నేహితులిద్దరినీ తీసుకొని అక్కడకు వచ్చింది. సింహం వెనుక కాకి, నక్క ఉండటం చూచి వడ్రంగి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతని వింత ప్రవర్తనకి సింహం ఆశ్చర్యపోయింది. మిత్రమా! వీళ్ళు నా కొత్త స్నేహితులు, నీక్కూడా మిత్రులే, భయపడవలసిన పనేమీ ల...

(Telugu) ఒంటె-సింహం కథ

[:te]ఒక అడవిలో ఒక సింహం నివశిస్తున్నది. అది ఆ అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దానికి సలహాలిచ్చేవి "పులి, నక్క, కాకి". మంచితనమే తప్ప లౌకికం తెలియని నా లాంటి ఒంటె ఒకటి ఒకనాడు వాని కంట పడింది. పులి, నక్క, కాకి మూడూ కలిసి దాని వద్దకు వెళ్ళి "ఎవరు నీవు? ఈ అడవికిఎందుకు వచ్చావు?" అని అడిగాయి. అపుడు ఒంటె "అయ్యా! నా యజమాని పెట్టె బాధలు పడలేక నేనీ పక్క గ్రామం నుండి ఈ రోజేవచ్చాను. దిక్కు లేని దానను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి" అని వాటితో అన్నది. అలాగే, భయపడకు! నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాము. మా వెంట రా! అని అవి మూడు ఒంటెను తీసుకొని సింహం వద్దకు వెళ్ళాయి. "ప్రభూ! ఇతడు మా వలెనే తమను సేవించడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు. మంచి బలం కలవాడు, బుద్ధిమంతుడు. దుడుకుతనమెరగని సాధు స్వభావుడు" అని గొప్పగా పొగిడాయి. సింహం ఒంటెను కుడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది. క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక...

(Telugu) నల్లి-చీరపోతు కథ

[:te]"మందవిసర్పణి" అనే పేరుగల చీరపోతు ఒకటి రాజుగారి పాన్పును ఆశ్రయించి కాలం గడుపుతూ ఉండేది. రాజుగారు గాఢంగా నిద్రపోయిన తరువాత అది నెమ్మదిగా బయటకు వచ్చి ఆయన రక్తం త్రాగి కడుపు నింపుకొనేది. పగటి పూట పరుపు కిందనో, తలగడ కిందనో దాగి ఎవరికంటా పడకుండా కాలం గడుపుతుండేది. ఏ ఆటంకము, ప్రాణ భయము లేకుండా ఆ చీరపోతు కాలం గడుపుతుండగా ఒకనాడు "డిండిమం" అనే నల్లి ఆ మంచం మీదకి చేరింది. దానిని చూచి మందవిసర్పణి "ఓయి! ఎచట నుండి వచ్చావు? నీ రాకకు కారణం ఏమిటి?" అని అడిగింది. అపుడా నల్లి "నా పేరు డిండిమము. ఇంతకాలం పేదల ఇళ్ళలో ఉన్నాను, ఎందరి రక్తమో రుచి చూసాను, కాని రాజుల రక్తం చవిచూడలేదు. సన్న బియ్యపు అన్నము, కమ్మని పప్పు, మాంసపు కూరలు, రుచిగల పిండివంటలు, వెన్న, నేయి, పాలు, పెరుగు, పండ్లు మొదలైన మంచి వంటకాలు భుజించే రాజుల రక్తం ఎంతో రుచిగా ఉంటుందని విన్నాను. దయచేసి నన్ను నీ స్నేహితునిగా భావించు. నేను కూడా నీతోపాటు ఈ మంచం మీదే కాలం గడుపుతాను" అని చీరపోతును బతిమాలింది. అమాయకురాలైన చీరపోతు సరే నీ ఇష్టం, నా సొమ్మేమీ పోదు కదా! కానీ ఒక్క విషయం, ఇక్కడ నీవెంతో జాగ్రత్తగా ఉండాలి. ...

(Telugu) సింహము-కుందేలు కథ

[:te]ఒక అడవిలో మదోత్కటమనే బలమైన సింహం నివశిస్తుంది. అది చాలా పొగరుబోతు, ఎంతో పౌరషం కలది. తన పంతం నెగ్గాలనే పట్టుదలగల క్రూర జంతువు. ఆ అడవిలో అది ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని ఎదురించే బలం ఏ మృగానికి లేదు. కాబట్టి అది తనకంటే బలంగలవారు లేరని గర్వంతో ప్రతి జంతువునూ భయపెడుతూ, తన కంటికి కనిపించిన జంతువునల్లా చంపటం మొదలుపెట్టింది. సింహం కనపడిందంటే చాలు అడవిలోని జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయేవి. ఒకనాడవన్నీ కలిసి ఒక తీర్మానం చేశాయి. రోజుకొకరు చొప్పున వంతు వేసుకొని సింహానికి ఆహారంగా వెళ్ళాలనినిర్ణయించుకున్నాయి. మృగరాజుగారు దయతో తమ ప్రార్థన అంగీకరించి, తమ ఇష్టం వచ్చినట్లు జంతువులన్నింటినీ చంపివేయకూడదని ఆ తీర్మానం. అవన్నీ కూడపలుక్కుని కలిసి కట్టుగా వెళ్ళి ఆ సంగతిని సింహానికి తెలియజేశాయి. "రోజూ ఇలా అవసరమున్నా లేకున్నా కనపడ్డ జంతువులన్నింటినీచంపితే ఈ అడవిలో జంతువులన్నీ కొద్ది రోజుల్లోనే నశిస్తాయి. తరువాత ఆకలితో నేనూ అవస్థ పడవలసి వస్తుంది" అని మనసులోనే అనుకొని అందుకు అంగీకరించింది. వేటాడకుండానే తన వద్దకు ఆహారం వస్తుందని, మృగాల మొర ఆలకించి సరే అన్నది. ప్రతిరోజూ మధ్యాహ్నంఅయ్య...

(Telugu) కొంగ-ఎండ్రకాయ కథ

[:te]ఒక చెరువులో చాలా చేపలున్నాయి. ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా చంపి తినాలనుకొంది. ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరుగెత్తి నీట మునిగేవి. కొంగ తలవంచి కండ్లు మూసి నాలుగు రోజులు తపస్సు చేస్తున్నదానిగా నటించసాగింది. చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు. చేపలకుదాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది. ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూచి "కొంగబావా! కాళ్ళ దగ్గరకి వచ్చిన చేపలనైనా ముట్టక నీవెట్లు బతికెదవు? ఇక్కడ ఒంటి కాలుపై నిలిచి కనులు మూసుకొని నీవేమి చేయుచున్నా"వని అడిగింది. అపుడా కొంగ జీవహింస మహాపాపమని పెద్దలు చెప్పగా విన్నాను. ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను. మాంసాహారం పూర్తిగా మానేశాను. ఆకు, అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను. అందుకే మీ వంకైనా చూడటం లేదు" అని చెప్పింది. కొంగ మాటలను చేపలు నమ్మాయి. ఆనాటి నుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి. కొంగ వాటికెన్నో కబుర్లు, కథలు, మరెన్నో విషయాలు చెప్పసాగింది. తన మీద వాటన్నిటికీ గురి కుదిరేలా ప్రవర్తించేది. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు కొంగ కన్నీరు క...

(Telugu) కాకి-పాము కథ

[:te]నర్మదానది తీరానఒక చెట్టు మీద కాకి జంట ఒకటి నివశిస్తున్నది. ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాముంది. కాకి దంపతులు ఆహారం కోసం వెళ్ళగానే పాము చెట్టెక్కి వాని పిల్లలను గ్రుడ్లను తినివేస్తుండేది. తమకంటే బలముగల పాము నేమియు చేయ జాలక ఆ కాకి జంట విచారంతో కాలం గడపసాగింది. ఒకనాడు ఆ కాకులకు స్నేహితుడైన నక్క వాని వలన సంగతి తెలుసుకొని "పూర్వం చేపలను మోసగించి తిన్న కొంగను ఉపాయం పన్ని మోసంతో ఒక ఎండ్రకాయ కొంగను చంపింది. మీకా కథ చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.  [:]

(Telugu) ఆషాడభూతి కథ

[:te]పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడుండేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, అనేక విషయాలు తెలిసినవాడు. చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. భక్తుల కథలు, దేవుని కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు వినడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు. వారు భక్తితో దేవశర్మకి పండ్లు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు. కానుకలు తెచ్చిన వారితో దేవశర్మ "ఎందుకు నాయనా ఇవన్నీ, ఎందుకు తల్లీ మీకీ శ్రమ" అని పైకి పలుకుతూ లోలోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు. ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకొని కూర్చొనేవాడు. ఒకనాడు "ఆషాడభూతి" అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు. అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయ విధేయతలతో సేవలు చేయనారంభించాడు. కొన్నాళ్ళకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుని వదిలి వెళ్ళేవార...

(Telugu) నక్క-పొట్టేలు కథ

[:te]"పూర్వం ఒక చోట బాగా బలిసిన రెండు పొట్టేళ్ళు పోట్లాడుకొంటున్నాయి. అవి దూరంగా వెనుకకు వెళ్ళిపరుగున వచ్చి ఢీ కొనడం మొదలుపెట్టాయి. రెండూ బాగా బలిసి ఉండటం చేత ఒకదానినొకటి తీసిపోక పోట్లాడుకొనుచున్నాయి. వాటి తలలు పగిలి అవి రెండు ఢీ కొన్నచోట రక్తం గడ్డకట్టింది. ఆ పోట్లాట చూచిన ఒక నక్క ఆ నెత్తురు చూడగానే దానికి నోరూరింది. పొట్టేళ్ల వెనక్కి దూరంగావెళ్ళిమరలా వచ్చి ఢీ కొనేలోగా ఆ రక్తాన్ని నాకేయాలనుకొంది. అలా నాకుతుండగా రెండు పొట్టేళ్ళు రివ్వున వచ్చి ఢీ కొన్నాయి. వాని తలల తాకిడికి మధ్యలో ఉన్ననక్క నలిగి చచ్చింది. దురాశ నక్క ప్రాణాలు తీసింది. మంత్రి పదవికై గల ఆశతో నేను మోసపోయాను" అని దమనకుడు కరటకునితో చెప్పాడు. అంతేకాకుండా "దేవశర్మ" అనే సన్యాసిని మోసగించిన"ఆషాడభూతి" కథను చెపుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించింది.[:]

(Telugu) నక్క-భేరీ కథ

[:te]ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి వివిధరకాల మాంసాలు తినడం మహా ఇష్టం. తన తెలివితేటలతో రకరకాల మాంసాలు సంపాదించుకొని తినేది. అది స్వయంగా పెద్ద జంతువుల్ని చంపలేదు. కాబట్టి చనిపోయిన కళేబరాలను కాని, సింహమో, పులో చంపి తిని వదిలిన మంసాలను ఆరగిస్తూ ఉండేది. ఒకనాడు దానికి ఆహారం దొరకలేదు. ఆహారం వెదుకుచూ బయలు దేరి ఒక యుద్ధభూమికి చేరింది. అక్కడ ఎన్నో శవాలు మానవులవి, గుర్రాలవి, ఏనుగులవి కనబడ్డాయి. వాటిని చూచి తన పంట పండిదని నక్క ఎంతగానో పొంగిపోయింది. దాని ఆనందానికి హద్దులు లేవు. ఇంతలో దానికి "ఢం-ఢం, గర్-గర్" అనే శబ్దాలు వినిపించాయి. అదేదో క్రూర జంతువు కోపంతో అరిచినట్లు తలిచి భయపడింది. ఒక బండ పక్కన దాగి కొంతసేపు ఆగి చూచింది. ఏ జంతువూ అటుగా రాలేదు. నక్క కొంచెం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక చెట్టు చాటున నక్కి చూసింది. అక్కడ ఒక చెట్టు కింద యుద్ధభేరి ఉంది. గాలికి చెట్టుకొమ్మ ఒకటి దానికి తగలటం వల్ల చప్పుడైందని గ్రహించింది. "ఓరి దేవుడా! ఈ భేరి నన్నెంతగా హడలగొట్టిందీ! ముందు దీని పని పట్టా"లని దానిపై గల చర్మాన్ని కొరికి తిన్నది. తర్వాత అక్కడున్న ఆహారాన్ని కడుపారా కొన్నాళ్ళు ఆరగించింది. ...

(Telugu) మిత్రబేధం - కోతి-వడ్రంగుల కథ

[:te]పంచతంత్రములలో మొదటి భాగమైన మిత్రలాభం పూర్తిగా వివరించి చెప్పిన తరువాత విష్ణుశర్మ రాకుమారులకు మిత్రభేదతంత్రాన్ని వివరించసాగాడు. "రాకుమారులారా! ఇది మీరు జాగ్రత్తగా వినండి. స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడగొట్టడాన్ని "మిత్రభేదం" అంటారు. బలవంతులిద్దరు కలిసి మిత్రులుగా ఉంటే వారి మైత్రికి భంగం కల్గించి తమ అవసరాన్ని సాధించుకోవడానికి బుద్ధిమంతులీతంత్రాన్ని ఉపయోగిస్తారు. పూర్వం రామాపురం అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో వర్ధమాను అనే వ్యాపారి ఒకడుండేవాడు. అతడు ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు పోయి వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. సరుకులన్నీ బండ్ల మీద వేసుకొని మరొక నగరానికి వెళ్లుచున్నాడు. అతడెక్కిన బండికి సంజీవకము, నందకము అను రెండు బలిసిన ఎడ్లు కట్టబడ్డాయి. ఆ అడవిదారిలో బండికి కట్టబడిన రెండు ఎద్దులలో సంజీవకం అనే ఎద్దు కాలు మడతపడి బెణికింది. ఆ కారణంతో సంజీవకం నడవలేక కింద పడింది. అపుడు వర్తమానుడు "నా ఎడ్లలో ఇది చాలా మంచిది. ఎన్నాళ్ళనుండియో నా వద్ద నమ్మకంగా పనిచేసింది. ఎవరికి ఎపుడు ఏ గతి కలుగుతుందో చెప్పలేము. దీనికి అడవిపాలు కావలిసి ఉంది కాబోలు! ఏం చేస్తాం ...

(Telugu) చిత్రాంగుని కథ

[:te]"మిత్రులారా! నేను ఆరునెలల వయస్సులోనే వేటగానికి చిక్కాను. బంధుమిత్రులు నన్ను చూచి ఎంతో దుఃఖించారు. వేటగాని రాకతో భయపడి పారిపోయారు. వారికోసం ఎంతగానో విలపిస్తూ ఉంటే, వేటగాడు నన్ను తన భుజానిపై వేసుకొని అతని ఇంటికి వెళ్ళాడు. అతడు నన్ను బాధించలేదు. నాతల నిమురాడు, ముద్దులాడి మేత పెట్టాడు. నా దగ్గరే పడుకున్నాడు. మరునాడు నన్నొక రాజకుమారుని దగ్గరుకు తీసుకెళ్ళి, ఆయనకు నన్ను కానుకగా ఇచ్చాడు. రాకుమారుడు సంతోషంతో నన్నెంతగానో మెచ్చుకున్నాడు. తల నిమిరి బుజ్జగించాడు. వేటగానికి మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ తరువాత నన్నొక శాలలో పెట్టి ఎంతో ప్రేమగా పెంచసాగాడు రాకుమారుడు. రాజభటులు నాపై ఈగ కూడా వాలకుండా కాపాడుతూ ఉండేవారు. నాకు రోజూ మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవారు. ఆ విధంగా క్రమక్రమంగా నాకు మనుషుల మీద భయం పోయి, వారికి మచ్చికయ్యాను. కొన్నాళ్ళకు నేను పారిపోననే నమ్మకంతో రాకుమారుడు నా ఇష్టం వచ్చినట్లు తిరగనిచ్చాడు. అప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు. ఎక్కడ తిరిగినా నన్ను అందరూ ఆదరించేవారే కాని అదలించేవారు లేరు. కోటంతా తిరిగి చూశాను, ఉద్యానవనాలలో విహరించాను. ఒకనాడు పట్టణం చూడాలని బుద్దిపుట్టింది. వెంట...

(Telugu) నక్క-విల్లు కథ

[:te]ఒక అడవిలో ఒక జిత్తులమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగ మిగిలిన జంతువుల మాంసాన్ని తిని జీవనం సాగిస్తుండేది. ఇలా ఉండగా ఒక రోజు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకొని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కన్పించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు.బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతనిని చంపి మరికొంత సేపటికి పంది కూడా అక్కడే చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి అదీ చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడి, పంది, పాముని, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం లభించడంతో ఎంతో ఆనదించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా! వేటగాని పక్కనే పడిఉన్న బాణంకు నరం బిగించి ఉంది. "ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం" అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగటంతో వంగి ఉన్న బాణం బద్ద వేగంగా, నిటారుగా సాగి, నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. నక్క అక్క...

(Telugu) బ్రాహ్మణస్త్రీ-నువ్వుల కథ

[:te]వర్థమానపురంలో ఒక పురోహిత దంపతులు ఉండేవారు. ఒకసారి అతని తండ్రి తద్దినం వచ్చింది. నువ్వు, పప్పుతో తద్దినం పెడదామని నిర్ణయించుకొని, ఆ పనిని బ్రాహ్మణుడు భార్యకు పురమాయించాడు. ఆమె నువ్వులు బాగుచేసి కడిగి పప్పును ఎండలో ఆరబెట్టింది. రెండు కోళ్ళు, రెండు ఎలుకలు పప్పును కాళ్ళతో చెరిగి తినసాగాయి. బ్రాహ్మణుడు చూచి "ఈ నువ్వులు అంటు పడినవి, తద్దినానికి ఇవి పనికిరావు, వీటిని ఎవరికైనా ఇచ్చి బదులు నువ్వులతో మరల పప్పు తయారుచేయ"మని భార్యను ఆజ్ఞాపించాడు. ఆ ఇల్లాలు నువ్వుపప్పు తీసుకొని నాలుగు ఇళ్ళు తిరిగింది. ఒక ఇంటి ఇల్లాలు సంతోషంగాఆ నువ్వుపప్పు తీసుకొని బదులు నువ్వులిచ్చి పంపింది. తాను కష్టపడకుండా "బాగుచేసిన నువ్వుపప్పు సరికి సరిగా సమానంగా దొరకడం అదృష్టంగా భావించి సంతోషించింది. ఇంతలో ఆ ఇల్లాలు భర్త వచ్చి సంగతి తెలుసుకున్నాడు. తరువాత ఆమెతో "పిచ్చిదానా! ముడి నువ్వులకు బాగుచేసిన నువ్వుపప్పుని ఎవరైనా ఇస్తారా? మేలి సరుకు ఇచ్చి నాసిరకం సరుకు ఎవరు మార్చుకుంటారు? ఏ కారణం లేకుండా ఆ ఇల్లాలు నూగుపప్పునిచ్చి ముడినూగులెందుకు తీసుకుంటుంది. ఆ విధంగా ఎందుకు చేస్తుందో కనుక్కున్నావా?" అని అడి...

(Telugu) చూడాకర్ణుని కథ

[:te]ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివశించు మటంలో "చూడాకర్ణు"డను సన్యాసి నివశించుచున్నాడు. అతడొక చిలుక కొయ్యకు తాను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు. నేను అతని గదిలోనే నివశిస్తూ ఉండేదాన్ని. అతడు లేని సమయమో, నిద్రపోయే సమయమో చూచి నేను ఆ పదార్థములను తింటూ ఉండేవాణ్ణి. నా అజాగ్రత్త వలన పాత్ర మీద మూత తీసినపుడు చప్పుడయ్యేది. నిద్రపోతున్న చూడాకర్ణుడు అపుడపుడు లేచి నన్ను బెదిరించేవాడు. వెంటనే నా స్థావరానికి పరుగు తీసేదాన్ని. చూడాకర్ణుడు నా చర్యలకు విసుగు చెంది, నా పీడను వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుండేవాడు. ఇలాఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు. అతన్ని పేరు వీణాకర్ణుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్న సమయం చూచి నేను పాత్ర మూత తీసి భోజనమారగించుచుంటిని. నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్ను అదలించాడు, ఇంకా నా గురించి వీణాకర్ణునికి చెప్పాడు. అది వినిన అతని స్నేహితుడు "దీని దుంప తెగ, ఈ ఎలుక ఎంత తెలివైనది, చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూతసైతము తొలిగించి భోజనం తోలిగించుచూ నీకు నష్టం కలిగించుచున్నదా, దీనికింత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, కారణం లేనిచో కార్...

(Telugu) గ్రద్ద-పిల్లి కథ

[:te]పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దానిమీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో "జరద్గవము" అను ఒక గుడ్డిగద్దజీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోడానికి కూడా చేత కాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షిపిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూచి "దీర్ఘకర్ణము" అనే జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది. పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద "ఓరీ దుర్మార్గుడా! నీవేవ్వడవు? ఇక్కడకు ఎందుకు వచితివి?" అని గద్దించింది. "నేను దీర్ఘకర్ణమనే పిల్లిని" అని చెప్పగా వినిన గ్రద్ద "నువ్వా! తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపొమ్ము, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా? లేదా? అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా! నేను ఎంత పాపం చేసితినో ఈ పిల్లి జన్మనెత్తితిని. అనేక పాపములాచారించితిన...

(Telugu) లేడి-కాకి-నక్కకథ

[:te]పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచిచెడులు మరొకరికి చెప్పు కొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి, ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్లి "నమస్కారం లేడి బావగారూ! నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువుల బాధపడలేక యిటువచ్చాను. వచ్చీ రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసుకదా! ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం" అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడి నక్క మాటలు నమ్మింది. "ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం" అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి "నక్క బ...

(Telugu) పులి-బాటసారి కథ

[:te]ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివశిస్తుంది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారినొకనిని చూచి "ఓ బాటసారి! ఇదిగో నావద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనాదానం చేయవలెనని ఎంత కాలం నుండో ఎదురుచూచు చున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్దిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో" అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం, మరొకవైపు భయం. అయినా ధైర్యం తెచ్చుకొని ఆ పులితో "పులిరాజా! నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకొనువారు ఉన్నారా?" అనగా, అప్పుడు పులి "నేను క్రూర జంతువునే, నీవు భయపడుట న్యాయమే. కాని నేను నీ వయస్సులో ఉన్నపుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానముచేయదలిచాను. లేవలేని సత్తు పండు ముసలదాన్ని, గోళ్ళు మోద్దువారినవ...

(Telugu) పావురాలు-వేటకాడు కథ

[:te]అనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు "వద్దు తొందర పడవద్దు మనుషులే లేని ఈ అడవిలోనికినూకలు ఎలా వచ్చినవి. ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించాడు. మీకా కథ చెబుతాను వినండి" అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.                              [:]

మనిషికో మాట .. గొడ్డుకో దెబ్బ

అక్బరుఫాదుషా సన్నిధికి ఒకనాడు నలుగు నేరస్థులను విరిచికట్టి తీసుకువచ్చారు భటులు. అందులో మొదటివాణ్ణి పిలిచి, చక్రవర్తి, “ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమా !” అని మృదువుగా చెప్పి విడిచిపుచ్చాడు. రెండవవణ్ణి గట్టిగా చీవాట్లుపెట్టి మందలించి, పంపివేసాడు. మూడోవాణ్ణి భటులచేత బలవంతంగా బయటకు నెట్టింపించాడు. ఇక నాలుగోవాడికి చుప్పనాతికిమల్లే ముక్కూ, చెవులూ చెక్కించి, తల గొరిగించి సున్నపుబొట్లు పెట్టి, గాడిదమీద ఊరేగించవలసిందని కఠినంగా అజ్ఞాపించాడు చక్రవర్తి. ఈ తీర్పు విని సభాసదులు ఒకరిమొహం ఓకరు చూసుకొని, గుసగుసలాడుకోసాగారు. ఆరితేరిన న్యాయమూర్తులు సైతం తెల్ల మొహాలేసారు. “ఏం నేర్పు, ఏంతీర్పు ! ఏంసబబు, ఏం న్యాయం !!” అని నలుగురూ నాలుగు విధాల అనుకున్నారు. “మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే, ఉన్నదున్నట్లు చెప్పవచ్చు. ఎంత మాత్రం బిడియపడకండి” అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి. అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయవిధేయలతో “ధర్మ మూర్తీ ! తమ న్యాయాన్ని మేము శంకించటం లేదు. కాని నలుగురూ ఒకే మోస్తరు నేరస్థులు కదా, ఈ నలుగురికి శిక్ష నాలుగు విధాలుగా ఎందుకున్నదో అనే విషయం మేం గ్రహించుకో లేకపో...

యాచకుడు కష్టసుఖాలు గురించి ఆలోచించాడు

ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జనుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచీ నిండుగా  బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు. మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జనుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారింది. చూస్తే భార్య లేదు. అంతేకాదు ఆ కుండ కూడా లేదు. పరుగెట్టుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు. మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్...

ఓ అమ్మ కథ

మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది. ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు. “అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు. ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది. మళ్ళ...

ఎమర్జెన్సీ కాల్

సర్జరీ కోసం ......ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్, హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.. డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడు..... మీకు కొంచెం కూడా బాద్యత లేదా?" డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను.... బయట వున్నాను ..... ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే, నేను నాకు సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.................. మరి ఇప్పుడు మీరు స్తిమిత పడి శాంతిస్తె ..... నేను సర్జరీకి వెళతా". తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొదుక్కే ఇలా జరిగివుంటే, నువ్వు శాంతంగా ఉండగలవా?" డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "నేను మన పవిత్ర వేదగ్రందాలలో వున్నది ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.... 'మనం మట్టి నుండే వచ్చాం ...మట్టిలోకే వెళ్ళిపోతాం... అది అంతా ఆ భగవంతుని మాయాలీలలు' ....... డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవత కాలాన్ని పోదిగించలేరు.. వెళ్లి మీరు నీ కొడుకు కోసం దేవు...

భార్య భర్తల మధ్య ప్రేమనీ చూడండి - మనసుకు హత్తుకునే కథ

ఆరోజు వారి పెళ్ళిరోజు, నీలిమ భర్త సoతోష్ కోసం ఎదురుచూస్తూ వుంది.... వారికి పెళ్లయి కొన్ని సoవత్సరాలు అయ్యింది. మొదట్లో చాలా సంతోషంగా వారి జీవితం సాగింది. రాను రాను చిన్న చిన్న సందర్భాలకి గొడవలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడు కోవడం లేదు, కాని ఇద్దరు ఒకే ఇంట్లోనే వుంటున్నారు... నీలిమ ఆలోచన అoతా ఒకటే ! ఈరోజు తమ పెళ్ళిరోజు గుర్తున్నదా లేదా అని.... అంతలొ కాలింగ్ బెల్ మోగింది. నీలిమ ఆనందంతొ తలుపు తెరిచింది... వర్షంలొ తడిసి వున్నాడు, చేతిలో పువ్వుల బోకే వుంది. ఇద్దరు గత స్మృతులలోకి వెళ్ళి మాట్లాడు కుంటున్నారు.... అంతలో ఫొన్ రింగ్ వినపడింది. నీలిమ పక్క గదిలోకి వెళ్లి ఫోన్ తీసింది.... అటువైపునుండి . . . ఇది సంతోష్ గుప్త గారి ఇల్లేనా? సారి మేడమ్ ఇక్కడ ఒక accident అయ్యింది. ఒకతను చనిపోయాడు, పర్సులో మీ భర్త గారి ఫొటో వుంది, మీరు వచ్చి శవాన్ని తీసుకెళ్ళండి..... నీలిమ ఒక్కసారి shock!!!!!!.. అయిన వెంటనే తేరుకొని నా భర్త నా దగ్గరే వున్నాడు. అది ఎలా సాద్యం? .. లేదు మేడమ్ ఈరోజు 4. 30pm కి train accident జరిగింది , మీ భర్త పర్సు వుంది ఇక్కడ.... నీలిమ పరుగు పరుగున ఆ గదిలోకి వెల్లి చూస్తే సంతోష్ లేడు... ...

చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కధ

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి….దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది…..అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు …! భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?. ఏమి జరగబోతోంది ? లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా? సింహం లేడిని తినేస్తుందా ? వేటగాడు లేడిని చంపెస్తాడా ? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా? ఒక వైపు నిప్పు , రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది….. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి…….పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చె...

సవాళ్ళే మనిషికి పరిపూర్ణతను ఇస్తాయి.

ఆ పరమాత్ముడి తో ఒక సన్నకారు రైతు ఒకసారి బలంగా దెబ్బలాట వేసుకొన్నాడు. "నీకు పైరు గురించి ఏం తెలుసు? నీకిష్టమైనప్పుడు వానను కురిపిస్తావు. ఆ కాలంలో గాలి వీచేలా చేస్తున్నావు. నీతో పెద్ద గొడవగా ఉంది. మాట్లాడకుండా ఆ పనులన్నీ ఒక రైతుకి అప్పగించారాదూ!” అన్నాడు. భగవంతుడు వెంటనే "అలాగా! అయితే ఈనాటి నుంచి గాలి, వాన, ఎండ అన్నీ నీ అజమాయిషిలోనే ఉంటాయి” అంటూ వరమిచ్చి చక్కాపోయాడు. ఆ రైతు ఆనందానికి అవధుల్లేవు. ఋతువులు మారాయి. "వానా! కురవాలి" అన్నాడు రైతు. కురిసింది. ఆగమనగానే ఆగింది. తడినేలను దున్నాడు. కావాల్సిన వేగంతో గాలిని విసరమన్నాడు. విసిరింది. విత్తుజల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ ఆ రైతు మాట ప్రకారమే జరిగాయి. పైరు పచ్చగా ఏపుగా పెరిగింది. ఆ పొలం చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది. కోతల కాలం వచ్చింది. రైతు ఒక కంకి కోశాడు. గింజ నులిమి చూ శాడు. అదిరిపడ్డాడు. లోపల ధాన్యం లేదు. ఉత్తి ఊక, మరొకటి, మరొకటి అంటూ అన్నీ కోసి చూశాడు. ఎందులోనూ ధాన్యం లేదు. అంతా ఉత్తి ఊకమాత్రమే ఉంది. "హారి దేవుడా!" అంటూ కోపంగా ఎలిగెత్తి పిలిచాడు. "వాన,ఎండ,గాలి అన్ని తగిన మోతాదుల్లోనే వాడాను. కాలానుగుణంగా...

ఆప్యాయత

అనగనగ ....ఒక ఊరు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు, ఆయన ప్రతిరోజు ఆయనకు కావలిసిన బియ్యం,కూరలు,చింతపండు,పప్పుదినుసులు,తెచుకుని వండుకుని తినేవాడు .అయ్యనకు నాలుగు కోడి పిల్లలు దొరికాయి , వాటికీ రామకోడి ,లక్ష్మన కోడి ,పెధనపసాని కోడి ,గజరజకోడి ,అని పేరులు పెట్టాడు .వాటిని రోజు ఎంతో ప్రేమగా సాకి పెంచేవాడు .వాటికీ రోజు అన్నం వేసే వాడు .ప్రతి రోజు ఒక దొంగ వాటిని గమనిచేవాడు .ఒక రోజు దొంగ ఆ బ్రాహ్మణుడు బయటకు వెళ్లి నపుడు వాటిని బ్రాహ్మణుడి మాటలా మాటమార్చి పిలిచి ఒక సంచీలో వేసుకుని వెళ్ళిపోయాడు .ఆబ్రాహ్మణుడు వచ్చి భోజనం కోసం వాటిని పిలిచాడు ఎంత పిలిచినా అవి రాలేదు . వాటి కోసం తిరగని ఇల్లులేదు ,వాటిని అంతగా మమకారం పెంచుకున్నాడు .ఆ దొంగ వాటిని ఒక బుట్ట కింద దాచాడు .అవి ఆ బ్రహ్మ్నాడు అటుగా వెళుతూ వాటిని పిలిస్తున్న మాటలు వాటికీ వినిపించాయి .అంతే వెంటనే వాటికీ కొండత బలంతో ఆ బుట్టని ఎగురవేసి అతని వద్హకు పరిగెత్తుకుని వచ్చి అతని చుట్టూ తిరుగుతూ ఇంటికి చేరుకున్నాయ్. ఆప్యాయత ఎవరినిఅయిన కట్టి పడేస్తుంది .జీవుల మధ్య తేడా చూడదు .

కోతి అందం నక్క తెలివి

అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉన్నది.చాలా చోట్ల తిరుగుతూ ద్రాక్ష పడ్లు కాసే పాదు ఒకటున్నది అని గమనిన్చిన్ద్ది . నక్కకు ఆ ద్రాక్షపళ్ళు తినాలని కోరిక పుట్టింది. కానీ అవి అందనంత ఎత్తులో ఉన్నవి. రోజు నక్క కళ్ళముందే అవి రాలిపోతున్నాయి. కానీ రుచికరమైన పండు ఒకటి కూడా తినలేక పోయింది. దానికి తినాలన్నా కోరిక గట్టిగా పెరిగింది. ఒక రోజు ఆ చెట్టు ఫై ఒక కోతిని చూసింది. నక్కకి ఒక ఆలోచన వచ్చింది. కోతిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంబించింది. ఓ అందమైన వానరమా నిన్ను చూడని ఈ కన్నులేల,నిన్ను పొగడని మాటలేల, నీ నడకల వయ్యారం నెమలికి నేర్పాలి. నువ్వు నడవటం కన్నా ఆ చెట్టు ఫై పరుగు పెడుతుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చేట్టుఫై పరుగు పెడుతుంటే చూడాలని ఉన్నాది. అనగానే ఆ కోతి మురిసి పోయి అటునుంచి ఇటుకు పరుగు పెట్టింది. దానితో ద్రాక్ష గుత్తు ఒకటి నెలన పడింది. నక్క ఆనందానికి అవధులు లేవు. ఆ ద్రాక్ష గుత్తు పట్టుకుని ఒకటే పరుగు. ఈ విషయం చూసిన కోతి కంగు తిన్నధి. నీతి :పొగడ్తలకు పొంగకూడదు.

పులి - మేక

[:te]అనగనగ ఒక మేకల గుంపు అడవిలోకి వెళ్లి మేత మేస్తు ఉండేవి కానీ ఒక రోజు మేకపోతు గుంపు నుండి విడిపోయింది. అది దారి తెలియక ఒక గుహలోకి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఉన్న ఎముకులను చూసి భయపడింది. ఇది పులి ఉండే గుహ అని తెలుసుకున్నది.దానికి భయం వెసిన్ధి. చీకటి పడే సమయం వచ్చింది. పులి రానే వచ్చింది .అది గుహ బయట ఉండగానే మేక దానితో ఆగు నేను నిన్ను చంపి తినటానికే వచ్చాను అన్నాది . పులి ఒక్కసారిగా కంగు తిన్నది. నేను నీ కన్నా పెద్ద మృగాన్ని నిన్ను చంపి తినటమే నాకు కావాలి అన్నది మేక. దానితో పులి కంగారు పడింది. మేక గడ్డాన్ని,మెరిసే కళ్ళను, వాడిగా పెరిగిన కొమ్ములను చూసింది. అవును ఇది నాకన్నా పెద్ద మృగం లాగా కనిపిస్తుంది. అనుకున్నది పులి. ఈ మృగం తో మనకు ఎందుకు వచ్చింది బతికి ఉంటె ఏదో జంతువుని తిని ఉండవచ్చు అనుకుని అక్కడనుంచి నెమ్మదిగా పులి జారుకున్నది.ఉదయం అయ్యేంత వరకు అక్కడే ఉండి. ఉదయం అవ్వగానే అటుగా వెళుతున్న తన గుంపుతో వెళ్లి పోయింది తరువాత మళ్ళి ఇటు వైపుకే రాలేదు . నీతి:భయం వేసినప్పుడు భయాన్ని పక్కన పెట్టి ఆలోచనాతో అడుగులు వెయ్యాలి.

కుందేలు తెలివి

ఊరి అవతల ఉండే చెరువులో ఓ కప్ప ఉండేది . చెరువు గట్టున ఉన్న చెట్టు పొదలలో ఒక కుందేలు ఉండేది . ఆ రెండు ఎంతో స్నేహంగా ఉండేవి. రొజూ కలిసి కలిసి కాసేపు కబుర్లు చెప్పు కొనిదే వాటికీ రోజు గడిచేది కాదు. ఒక రోజు అనుకోకుండా కప్ప ఒక గోతిలో పడింది. కానీ కప్ప ఫైకి రాలేక పోతుంది.దాన్ని గుర్తించిన కుందేలు కప్పకు రాగల శక్తి ఉన్నదని గుర్తించింది.కాని కప్ప దాని శక్తి సామర్జాలు తెలుసుకోలేక ఏడవటం మొదలు పెట్టింది.వెంటనే కుందేలు తెలివిగా ఒక తాడు ముక్కని గోతిలోవేసింది అదిగో పాము ఈ గోతిలోకి వస్తుంది నిన్ను తినేస్తుంది అని గట్టిగా అరిచింది . ఆ కంగారులో అది పామో లేక తాడో చూడకుండానే ఒక్క దూకున ఫైకి వచ్చింది . మిత్రమా నీ శక్తి నీకు తెలియక పోవటం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పింది. నీతి : ఎప్పటికి మన శక్తి ని తక్కువ అంచనా వెసుకొరాధు.

ఒక చీమ కథ ..

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది , పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు . ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు ...

ఓర్పు

అనగనగా ఒక ఊరి సమీపంలో రెండు పెద్ద రాళ్ళు ఉండేవి. రాజు దగ్గర పనిచేసే ఒక శిల్పి,అలా వెళుతుండగా ఆ రాళ్ళను చూసాడు. వాటితో మంచి శిల్పాలు చెయ్యచ్చు అని ఒక రాయిని కొట్టాడు. ఆ రాయి నొప్పిభరించలెక ఓ మహాశిల్పి నువ్వు నన్ను శిల్పంగా మార్చవచ్చు కానీ నేను నొప్ప్పిభరించలెక పోతున్నాను నన్ను ఒదిలెయ్ అని చెప్పింది. అప్పుడు శిల్పి తన పక్క రాయిని చెక్కాడు. అది ఒక అద్భుత శిల్పంగా మారింది. దాన్ని మహారాజు చూసి ఆలయం లో పెట్టించాడు. ఆలయానికి గట్టు పెద్దది కావడం తో భక్తులకు ఇబ్భందిగ ఉన్నందుకు మహారాజు మొదటి రాయిని మెట్టుగా వేయించాడు. దానితో ఆ భక్తులు రోజు ఆ రాయిని తొక్కి వెళ్ళేవారు . కానీ శిల్పంగా మారిన రాయి గుళ్ళో హాయిగా పూజలు అందుకుంటుంది . నీతి ; ఓర్పు వహిస్తే తరువాత సుఖంగా ఉండవచ్చు. ఓక వేళ సుఖం కోరుకుంటే తరువాత కష్టం అనుభవించాలి . మొదటి రాయి ఓర్పు వహించాలేఖ పోయింది అందుకే చాల కష్టం అనుభవిస్తుంది. రెండవ రాయి ఓర్పు వహించింది అందుకే హాయిగా పూజలు అందు కుంటుంది.