(Telugu) జింక, నక్క, కాకి కథ

[:te]మగధదేశంలో మందారవనం అనే అడవిలో ఒక జింక ఒక కాకి ఉండేవి. అవి ఎంతో హాయిగా, ఆనందంగా ఆ అడవిలో తిరుగుతూ ఉండేవి. అవి రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి.
ఒకనాడు ఆ జింకని ఒక నక్క చూసింది. దాన్ని చూడగానే నక్కకు నోరూరింది. దీన్ని ఎలాగైనా తినేయాలి అనుకుంది. వెంటనే జింక వద్దక వెళ్ళి కుశలప్రశ్నలడుగుతూ పలకరించింది.

“నన్ను కుశలమడుగుతున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు?” అంది జింక.

దానికి నక్క “నేనొక నక్కను, నా పేరు సుబుద్ధి. నా అనేవాళ్ళంటూ ఎవరూలేరు ఒంటరిగా ఉన్నాను. నిన్ను చూడగానే ఆత్మీయుడివలె అనిపించింది. నన్ను నీ స్నేహితుడిగా స్వీకరించు.” అంది.
జింకకి జాలి కలిగి నక్కను స్నేహితుడుగా స్వీకరించి తతో పాటుగా తీసుకుని వెళ్ళింది.

జింకతో కలిసి వచ్చిన నక్కని చూసిన కాకి అనుమానపడుతూ ఎవరతడని అడిగింది. ఇతనొక నక్క. పేరు సుబుద్ధి, మనతో స్నేహితుడిగా ఉంటానంటే తీసుకు వచ్చాను.” అంటూ నక్క గురించి చెప్పింది జింక.

“కొత్తవారిని ముందువెనకలు చూడకుండా నమ్మకూడదు, పూర్వం జరద్గవము అనే గద్ద ఓ పిల్లిని నమ్మి తన ప్రాణాలనే పోగొట్టుకుంది. ఆ కథ నీకు చెపుతాను. అని జరద్గవము అనే గద్ద కథ చెప్పసాగింది కాకి.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము