Posts

Showing posts from July, 2020

విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా ?

బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉండే పట్టువదలని విక్రమార్కుడు కథ మనందరికీ తెల్సిందే.. ఐతే ఆ విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా.. అసలు విక్రమార్కుడి ఆ సింహాసనం ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటి మనం ఇపుడు తెలుసుకుందాం.. పూర్వం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది.. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు ఇద్దరు విద్యనభ్యసించినడి ఇక్కడే… ఈ మహాపట్టణంలోని మేడలు మేరుపర్వతాన్ని మించి ఎత్తు ఉంటాయట. ఆ మేడల్లో నివసించే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. విక్రమార్కునికి మంత్రి భట్టి. అయితే భర్తృహరి కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళి పోతాడు. అనంతరం విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలుస్తుంది… ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులన...

రూపాయి చెప్పిన బేతాళ కథల సారాశం

అలకాపురి. అందులో రాజభవనం. అందులో దివ్యమణిఖచితమైన గోడలతో, సర్వాలంకారాలతో భవ్యమైన కుబేర మందిరం. అన్ని అలంకారాలతో అలరారుతూ అందంగా అక్కడికి నడిచివచ్చింది కుబేరుడి భార్య చంద్రరేఖ. “ఏమిటి స్వామీ ఏదో వ్యాకులత మిమ్మల్ని బాధిస్తున్నట్లుంది?” అడిగింది ఆమె కుబేరుణ్ణి చూస్తూ. “వ్యాకులత కాదు దేవీ, ఆత్రుత. సంపద రహస్యాల గురించి మానవులకు ఎంత అవగాహన వుందో తెలుసుకోమని భూలోకానికి పంపించిన రూపీ బేతాళుడు ఈ రోజు తిరిగి వస్తున్నాడు. అతని కోసమే ఎదురుచూస్తున్నాను.” అని కుబేరుడు అంటుండగానే రూపీ బేతాళుణ్ణి ఆ మందిరంలోకి అడుగుపెట్టాడు. వస్తూనే కుబేరుడికి నమస్కరించి - “ప్రభూ, మీరు చెప్పినట్లే నేను ఒక మానవుణ్ణి కలిసాను. అతని పేరు మధ్యతరగతి విక్రమార్కుడు. అతని ఆర్థిక పరిజ్ఞానం ఎంత వుందో, అతను తన జీవితంలో సంపద సాధించగలడో లేడో అని రకరకాల కథల ద్వారా పరీక్షలు పెట్టాను. అతను చెప్పిన ఆర్థిక పాఠాలన్నీ మీకు మళ్ళీ వినిపిస్తాను. వినండి” అంటూ ఇలా చెప్పసాగాడు. సంపాదన వేరు సంపద వేరు. వచ్చేది సంపాదన అయితే నిలిచేది సంపద. ఇదే ఆర్థిక ప్రగతికి తొలి సూత్రం సంపాదనని సంపదగా మార్చడం ప్రణాలికతో మొదలౌతుంది. ఇప్పటి ఖర్చులను తెలుసుకోని,...

బిర్బాల్ ఖిచాడి

Image
  ఒకసారి చల్లని శీతాకాలపు రోజున, అక్బర్ మరియు బీర్బల్ ఒక సరస్సు మీదుగా వెళుతున్నారు. అక్బర్ ఆగి, గడ్డకట్టే నీటిలో వేలు పెట్టి, “ఈ చల్లని నీటిలో ఎవరైనా రాత్రి గడపగలరని నేను అనుకోను” అని చెప్పి వెంటనే దాన్ని బయటకు తీశాడు. బీర్బల్ దానిని ఒక సవాలుగా తీసుకున్నాడు మరియు అలా చేయగల వ్యక్తిని కనుగొంటానని చెప్పాడు. సరస్సు యొక్క చల్లని నీటిలో ఒక రాత్రి గడపగలిగిన వారికి 1000 బంగారు నాణేల మొత్తాన్ని అక్బర్ వాగ్దానం చేశాడు. త్వరలో, 1000 బంగారు నాణేల కోసం సవాలును స్వీకరించడానికి అంగీకరించిన ఒక పేద వ్యక్తిని బిర్బల్ కనుగొన్నాడు. ఇద్దరు రాజ కాపలాదారుల రక్షణలో, పేదవాడు రాత్రంతా గడ్డకట్టే నీటిలో నిలబడ్డాడు. ఉదయం, పేదవాడిని బహుమతి కోసం కోర్టుకు తీసుకువెళ్లారు. గడ్డకట్టే నీటిలో ఎలా నిలబడగలరని రాజు అడిగినప్పుడు, ఆ వ్యక్తి, “నా ప్రభూ, నేను దూరం వద్ద కాలిపోతున్న దీపం వైపు చూస్తూనే ఉన్నాను, నా రాత్రంతా దాన్ని చూస్తూనే ఉన్నాను” అని సమాధానం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న చక్రవర్తి, "ఈ వ్యక్తి సరస్సులో నిలబడగలిగినందున అతను దీపానికి వెచ్చదనం పొందుతున్నందున బహుమతికి అర్హుడు కాదు" అని చెప్పాడు. పేదవాడు విచారకరంగ...

విక్రమార్కుడు-బేతాళుడు - వీణాధరి నిర్ణయం

Image
  పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో, అర్ధరాత్రి వేల ఈ స్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే, నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది. అదేమంటే – అసలు నువ్వు సాధించదలచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు, కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేదా? లేక నలుగురిలో నిన్ను అవమానమూ, అపహాస్యాలపాలు చేసేదా? ఎందుకంటే, ఎవరూ తమ స్థాయికి మించిన పనులకు పూసుకోరాదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా, వీనాధరి అనే ఒక యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పా సాగాడు. చంద్రశిలా రాజ్యలో రాజయ్యా అనే పేదరైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచేక, ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు. ఆ శిశువు కనుముక్కు తీరుతోపాటు శరీరం మేలిని బంగారంతో తులతూగేలా వుంది. అటువంటి అందాలరాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి, ఆమెకు వీణాధరి అన...

(Telugu) నరకం 2.0

[:te] త్రిలోక సంచారి అయిన నారదులవారు అలవాటు ప్రకారం ముల్లోకాలూ తిరుగుతూ ఒకసారి నరకం మీదుగా వెళుతున్నాడు. మామూలుకంటే భిన్నంగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఆలోకాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందాయనకు. "ఎప్పుడూ పాపుల హాహాకారాలతో, యమకింకరుల వికటాట్టహాసాలతో దద్దరిల్లుతుండే నరకమేనా ఇది" అని ఆశ్చర్యపోతూ దిగి నరకంలోకి ప్రవేశించాడు విషయం తెలుసుకుందామని. చూస్తే ఏముందీ, దిగాలుగా ఓ మూల నిలబడున్నాడు చిత్ర గుప్తుడు. ఆయనకు కొద్ది దూరంలో ముఖాలు వేళ్ళాడేసుకుని యమకింకరులు! శిక్షలు విధించటానికి తీసుకుని రాబడ్డ పాపులంతా తమలో తాము పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు. నారదుడి ఆశ్చర్యం రెట్టింపైంది. "చిత్రగుప్తా, ఏమిటి సంగతి, ఏదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లు కనిపిస్తున్నావు?" అడిగాడు నారదుడు. "ఏం చెప్పమంటారు స్వామీ నా కష్టాలు? చాలా చిక్కు సమస్యలో ఇరుక్కున్నాను. మీరే నన్ను కాపాడాలి. అసలే యమధర్మరాజులవారు వచ్చే సమయం అయ్యింది" అన్నాడు చిత్రగుప్తుడు, బావురుమనే గొంతుతో. నారదుడేదో బదులివ్వబోయే లోపు యమధర్మరాజు వస్తున్న సూచనగా గంట మోగనారంభించింది. చిత్రగుప్తుడూ మిగిలిన కింకరులూ ఎంతో ఆదుర్దాగా ...

రాక్షసుడిదానం

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, “రాజా, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి మధ్య, ఒళ్ళు జలదరింపజేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూంటే, ఒక్కొక్కసారి నీపట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది. ఎందుకంటే — కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే. ఏదైనా అలౌకికశక్తిని సాధించాలనుకునేవాడు, కొద్దిపాటి అవాంతరాలూ, ఇక్కట్లూ ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనుకంజ వేస్తాడు. అలా కాక, ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు, తన ప్రయత్నంలో అవసరం అయితే ఆత్మార్పణ చేయగలడు. అయితే, కొన్ని సమయాల్లో ఏది తనమేలో, ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైన మొండి పట్టుదలగల మనుషులు కూడా వుంటారు. నిన్ను ఈ కష్టకార్యానికి పురిగొల్పిన వాడు ఎలాంటి వాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న శంక కలుగుతున్నది. అపాత్రదానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు. ఇది మానవులకే కాదు; రా...

కవిపండితులు పోటీ

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి , చెట్టు పై నుంచి శవాన్ని దించి భూజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, ఎంతో శ్రమతో కూడిన యింత కఠిన కార్యానికి, నిన్నెవరు ప్రోత్సహించారో నాకు తెలియదు. కార్యసాఫల్యం తరువాత నీకు లభించబోయేవేమిటి ? సంపదలా ? కీర్తా ? లేక యీ రెంటిని ఆశిస్తున్నావా ? ఒకే వ్యక్తి యీ రెండింటికీ అర్హుడు కావడం చాలా అరుదైన సంగతి. వివేకి అయినవాడు, ఈ రెంటిలో ఏ ఒకదాని కోసం మాత్రమే, తన యావచ్ఛక్తినీ వినియోగిస్తాడు. ఆలా కానప్పుడు ఒక్కొక్కసారి నలుగురి లో అవహేళన పాలు కావలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు, ఇద్దరు కవిపండితుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను.” అంటూ యిలా చెప్పసాగాడు: ఒకానొకప్పుడు ప్రసన్నుడనే కవి, తన కవిత్వాన్ని వినిపించి రాజాశ్రయం సంపాదించాలని పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అప్పుడు పాటలీపుత్రాన్నేలుతున్న మహాసారుడు సాహితీ ప్రియుడని పేరు. ప్రసన్నుడు రాజదర్శనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కాని, రాజభటులు ఆటంకం కారణంగా అవన్నీ తన బాధను ఒక రత్నాలవ్యాపారికి చెప్పుకున్నాడు. వ్యాపారి అంతా విని, “నాకు రత్నాల విలువ మాత్...

దివ్యశక్తుల పరీక్ష

Image
పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, ఒక దేశపాలకుడుగా, నీకున్న కీర్తి ప్రతిష్ఠలేమిటో నాకు తెలియవు. రాజైనవాడికి ధర్మ గుణం, పరాక్రమం, తెలివితేటలూ వున్నంత మాత్రాన చాలదు. వాటికి తోడు సూక్ష్మ బుద్ధీ , మనోస్థైర్యం అవసరం. ఆ రెండూ నీలో లోపించిన కారణంగానే, ఈ అర్థరాత్రి వేళ ఎదో అసాధ్యమైన కార్యాన్ని సాధించబూని, ఈ శ్మశానంలో తిరుగుతున్నావని, నాకు అనుమానం కలుగుతున్నది. రాజు మాధవసేనుడి లాగా, కొందరు తాము చేయని నేరానికీ, పాపానికీ తమకుతామే శిక్ష విధించుకుంటారు. ఇందుకు కారణం సూక్ష్మ బుద్ధీ, మనోస్థైర్యం లేకపోవడం. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను, విను.” అంటూ ఇలా చెప్పసాగాడు : ఒకానొకప్పుడు కొసలదేశాన్ని, మాధవసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాలలోను ఆయనకు ఆయనే సాటి అని పేరు వచ్చింది. ఇలా ఉండగా — కొసలదేశంలో అగ్నినేత్రుడనే మాంత్రికుడు ప్రవేశించాడు. వాడు క్షుద్రవిద్యలతో సామాన్య పౌరులను భయపె...

నిజమైన వేటగాడు

Image
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు పై నుంచి శవాన్ని దించి, భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవ సాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘రాజా, నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఏ ప్రయోజనం ఆశించి ఇలా సంచారిస్తున్నావో నాకు బోధ పడడం లేదు. బహుశా ఎవరికైనా న్యాయం చేయటానికో లేక ఎవరి ప్రాపకం సంపాదించడానికో ఈ పనికి పూనుకున్నవేమో! ఎవరి ప్రాపకం కోసం ఈ పని చేస్తున్నావేమో కానీ, ఆ కార్యం నువ్వు కష్టపడి నెరవేర్చినా, వాళ్ళు నీ నిజాయితీని నమ్మకపోవచ్చు. పూర్వం తను దొంగ కాకున్నా వట్టి పుణ్యానికి అనుమానించబడ్డ ఒక వేటగాడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను,’ అని కథ చెప్పసాగాడు. పూర్వం బసవయ్య అనే వేటగాడు అడవి పక్కన ఉన్న కొమ్ముగూడెం లో నివసిస్తూండేవాడు. గూడెం పక్కనున్న అడవి లోని జంతువులు, పక్షులే అతనికి జీవనాధారం. వాటిని పట్టి సమీప గ్రామాల్లో అమ్ముకుని జీవిస్తూండేవాడు. ఒకనాడు ఎప్పటిలాగే అడవిలోకి వెళ్లేసరికి బాట పక్కన సగం తినేసిన మనిషి శవం కనబడ్డది. దానికి కాస్త దూరంలో నేల మీద మెరుస్తూ బంగారం గొలుసు కనబడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. సంతోషంగా మెడలో వేసుకున్నాడు. తర్వాత ఓ కుందేలును వేటాడి ఇంటికి తీసుకునిపోయాడు. ఓ నెల తర్వ...